Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు రాజధానులు : పయ్యావుల కేశవ్ ఎద్దేవా

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (10:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు రాజధానులు అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. వచ్చే 2024 వరకు నవ్యాంధ్రకు హైదరాబాద్ నగరమే రాజధాని అంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై పయ్యావుల మండిపడ్డారు. ఇపుడు ఏపీకి మూడు రాజధానులకు తోడు నాలుగు రాజధాని కూడా వచ్చేసింది అంటూ ఎద్దేవా చేశారు. 
 
గత ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని రకాలుగా సాయం చేసిన తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌కు రుణం తీర్చుకోవడానికి ఏపీని అన్ని విధాలుగా నాశనం చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని, అందుకే తొలుత మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. 
 
ఇపుడు హైకోర్టు తీర్పుతో ఏం చేయాలో తోచక నాలుగో రోజధాని డ్రామాకు తెరలేపారన్నారు. ఏపీ రాజధాని అమరావతి విషయంలో వైకాపా నేతల మనస్సులో ఎంత వ్యతిరేకత ఉందో మంత్రి బొత్స వ్యాఖ్యలతో మరోసారి బయపడిందన్నారు. 
 
వైకాపా నేతలు ఇప్పటికీ హైదరాబాద్‌నే నవ్యాంధ్ర రాజధానిగా భావిస్తున్నారన్నారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన వాటి విషయంలో వైకాపా నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక అసెంబ్లీ సమావేశాలు కాలేజీలో ర్యాగింగ్‌ను తలపించేలా సాగుతున్నాయని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments