Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో పవన్ కల్యాణ్ పర్యటన.. స్టీల్ ప్లాంట్ నిలుపుదల కోసం..?

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (19:36 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటించనున్నారు. ఈ మేరకు 31వ తేదీన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకొని అక్కడి నుంచి స్టీల్‌ ప్లాంట్‌ ప్రాంగణానికి వెళ్ళి పరిరక్షణ సమితి ప్రతినిధులను కలసి వారు నిర్వహించే సభలో పాల్గొంటారు. 31వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు సభ ప్రారంభమవుతుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని కోరుతూ ఉక్కు పరిరక్షణ సమితి పోరాడుతోంది. 
 
ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఈ అంశంపై తొలుతనే స్పందించి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళిన నాయకుడు పవన్‌ కళ్యాణ్ గారే. ఫిబ్రవరి 9న పవన్‌ కళ్యాణ్ కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి అమిత్‌ షాని కలిసి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ భావోద్వేగాలతో ముడిపడి ఉందనే విషయాన్ని కేంద్రానికి తెలియచేస్తూ, ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని వినతి పత్రం అందించిన విషయం విదితమే. 
 
34 మంది ప్రాణత్యాగాలతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటైందనే విషయాన్ని ఈ సందర్భంగా అమిత్‌ షాకి తెలియజేశారు. జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్ గారు తమ పోరాటానికి అండగా ఉండాలని, సభలో పాల్గొనవలసిందిగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో పవన్ ఈ నెల చివర్లో విశాఖలో పర్యటించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

Vijay: రష్మిక మందన్న బర్త్ డే వేడుకను ఓమన్ లో జరిపిన విజయ్ దేవరకొండ !

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments