ఏపీ సీఎం నెక్ట్స్ ప్లాన్ ఏంటి? పవన్‌ జేఏసీ ఎంతవరకు వచ్చింది?

ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంటులో వివిధ రూపాల్లో నిరసన తెలిపిన నేపథ్యంలో ఏపీకి ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చే దిశగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తదుపరి చర్యలపై ఏపీ సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఇందు

Webdunia
ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (12:37 IST)
ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంటులో వివిధ రూపాల్లో నిరసన తెలిపిన నేపథ్యంలో ఏపీకి ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చే దిశగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తదుపరి చర్యలపై ఏపీ సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఇందులో భాగంగా తదుపరి చర్యలపై చంద్రబాబు నాయుడు పార్లమెంట్ సభ్యులను సలహా అడిగారు. ఈ మేరకు ఎంపీలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. 
 
రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే విషయాన్ని  జాతీయ స్థాయిలో గొంతెత్తి  చాటారని విషయాన్ని కొనియాడారు.  అదే స్ఫూర్తితో తదుపరి సమావేశాల్లోనూ నిరసనలు తెలిపి.. డిమాండ్లను సాధించుకురావాలని పిలుపు నిచ్చారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌కు కేంద్రం సానుకూల సంకేతాలు పంపిందనే విషయాన్ని ఓ ఎంపీ ప్రస్తాలించారు. 
 
జోన్, హోదాకు బదులుగా ఇస్తామన్న ప్యాకేజీ, విద్యాసంస్థలు, రాజధానికి నిధులు తదితర విషయాలపై చంద్రబాబుతో చర్చించారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వుండాలని చంద్రబాబు ఆదేశించారు.  
 
మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్‌తో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ భేటీ కానున్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలపై వీరిద్దరూ చర్చిస్తారని జనసేన వర్గాలు తెలిపాయి. ఇప్పటికే జేఏసీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వున్న పవన్.. అందులో లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్‌లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments