Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల వద్దకు వెళ్లకుండా ఉండేందుకే చీకటి జీవో : పవన్ కళ్యాణ్

Webdunia
ఆదివారం, 8 జనవరి 2023 (15:10 IST)
వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం వైకాపా నేతలకు పట్టుకుందని, అందుకే విపక్ష పార్టీల నేతలు ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకునేందుకు చీకటి జీవో నంబరు 1ని తీసుకొచ్చారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఆయన ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును హైదరాబాద్ నగరంలో ఆయన నివాసంలో కలుసుకున్నారు. వీర్దదరూ సుధీర్ఘంగా సమావేశమయ్యారు. 
 
ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి అరాచక పాలన సాగిస్తున్నారన్నారు. పెన్షన్లు తొలగింపు, ఫీజు రీయింబర్స్‌మెంట్, శాంతిభద్రతలు లోపించడం, రైతులకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, ఇసుక అక్రమ రవాణా, డ్రగ్స్ మాఫియా వంటి అంశాలపై చర్చించినట్టు తెలిపారు. 
 
పైగా, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపకుండా ఉండేందుకు, విపక్ష నేతలు ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకునేందుకు వీలుగా జీవో నంబర్ 1 ను తీసుకొచ్చారని ఆరోపించారు. ఇలాంటి చెత్త జీవోలను తీసుకురావడాన్ని ఆపాలని బలంగా నిర్ణయించుకున్నామని తెలిపారు. 
 
ఈ జీవో తీసుకుని రావడానికి ముందే తనను వైజాగ్‌లో అడ్డుకున్నారని, వాహంలో నుంచి దిగకూడదు, ప్రజలకు అభివాదం చేయకూడదు.. గదిలోనుంచి బయటకు రాకూడదు ఇలా అనేక ఆంక్షలు విధించారని పవన్ మండిపడ్డారు. ఇపుడు జీవో నంబర్ 1 ను తీసుకొచ్చి, పోలీసుల అండతో చంద్రబాబును అడ్డుకున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments