Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాలంటీర్లను గత వైసిపి ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది: పవన్ కల్యాణ్

సెల్వి
గురువారం, 7 నవంబరు 2024 (18:30 IST)
Pawan kalyan
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నోరు విప్పారు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచలతోనే కూటమి ప్రభుత్వం ఉందన్నారు. గత ప్రభుత్వం వారిని మోసం చేసిందన్నారు. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయొచ్చు.. కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు.. ఇదో సాంకేతిక సమస్య అంటూ తేల్చి చెప్పారు. 
 
ఎన్నికల ప్రచార సమయంలో వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని టీడీపీ, జనసేన కార్యకర్తలు, నేతలూ ఆరోపించారు. వారి వాదనకు బలం చేకూర్చుతూ.. కొంతమంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ వైసీపీకి తరపున ప్రచారం చేశారు. 
 
ఐతే.. ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారనీ, తాముగా అలా చెయ్యలేదని అన్నారు. అయితే అమరావతిలో జరిగిన సర్పంచ్ సంఘాల సమావేశంలో వాలంటీర్ల వ్యవస్థపై పవన్ స్పందించారు. 
 
వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని సర్పంచులు కోరగా.. అందుకు పవన్ ఒప్పుకోలేదు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం ఉంది అన్నారు. తద్వారా వాలంటీర్లకు ప్రభుత్వం ఇప్పటికీ అనుకూలంగానే ఉంది అనే సంకేతం ఇచ్చారు.
 
వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని గ్రామ సర్పంచి పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్​పై స్పందించారు. సచివాలయ సిబ్బందిని గ్రామ పంచాయతీ పరిధిలోకి తెచ్చేందుకు అభ్యంతరం లేదన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ వాయిదాకు కారణం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments