Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేస్తే నరకానికి వెళ్లరు... పవన్ కళ్యాణ్ : నెలంతా ఘనాహారం బంద్.. (video)

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (15:18 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కార్తీకమాస దీక్ష చేపట్టారు. దీంతో నెల రోజుల పాటు ఆయన ఘనాహారాన్ని స్వీకరించబోనని చెప్పారు. ఈ నెల రోజుల పాటు కేవలం ద్రవాహారమే తీసుకుంటానని తెలిపారు. అదేసమయంలో కార్తీక మాసంలో మొక్కలను నాటడం వల్ల నరకానికి వెళ్లరని శ్రీ వరాహ పురాణంలో వేద వ్యాసుడు పేర్కొన్నాడని, అందువల్ల ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 
 
హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న తన వ్యవసాయక్షేత్రంలో ఆయన వన రక్షణ పేరుతో వన సంరక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఒక్కో రావి, వేప, మర్రి మొక్క.. పది రకాల పూల మొక్కలు.. ఐదు మామిడి మొక్కలు, రెండేసి దానిమ్మ, నారింజ మొక్కలు నాటినవారు నరకానికి వెళ్లరు. వేద వ్యాసుడు రాసిన 'శ్రీ వరాహ పురాణం'లో ఈ విషయం ఉందని ఆయన వెల్లడించారు. 
 
ముఖ్యంగా, భూదానం, గోదానం వల్ల ఎంత పుణ్యం వస్తుందో మొక్కలను నాటి సంరక్షించడం వల్ల అంతే పుణ్యం వస్తుందని ఈ పురాణం చెబుతోందన్నారు. అలాగే, కార్తీక మాసంలో నిర్వహించే వన భోజనాలు వర్గ, కుల భోజనాలు కాకూడదని అన్నారు. అన్ని వర్గాల వారు కలిసి వన సంరక్షణ దిశగా వేసే వన సమారాధన వేదికలు కావాలని పిలుపునిచ్చారు. 
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments