Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 యేళ్ల తర్వాత తమకు నచ్చిన వారికి ఓటు వేశామని చెప్పారంటే... : పవన్ కళ్యాణ్

ఠాగూర్
గురువారం, 14 ఆగస్టు 2025 (22:40 IST)
ఏపీలోని కడప జిల్లా పులివెందులలో 30 యేళ్ళ తర్వాత తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేశామని స్థానిక ఓటర్లు చెబుతుంటే అక్కడ పరిస్థితు ఏ విధంగా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం వెల్లడైన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ, పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థులు సాధించిన విజయం ఆయా మండలాల ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ఆయా ప్రాంతాల్లో విజయం సాధించిన లతారెడ్డి, ముద్దుకృష్ణారెడ్డిలకు ఆయన అభినందనలు తెలిపారు. 
 
వైకాపా హయాంలో జరిగిన గత స్థానిక  సంస్థల ఎన్నికల్లో కనీసం నామినేషన్ కూడా వేయనీయలేదన్నారు. నామినేషన్ వేద్దామనుకున్న వారిపై భౌతిక దాడులకు పాల్పడి వారిని భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఇపుడు ఏకగ్రీవాలకు వెసులుబాటు ఉన్నప్పటికీ కానీ ఏకపక్షంగా ఎన్నికలు సాగినపుడు ప్రజాస్వామ్యబద్ధమైన తీర్పు రాకపోవచ్చన్నారు. పులివెందులలో పోటీ ఉండటం వల్లే ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ తీర్పును వెల్లడించారన్నారు. ఇప్పటివరకు ఏకగ్రీవం పేరుతో ఎవరూ పోటీలో లేకుండా చేసుకుంటా వచ్చారని, ఇపుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో పోటీకి ఆస్కారం కలిగిందని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments