Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను ఒంటరిగా పోటీ చేయమనడానికి మీరెవరు : వైకాపాకు జనసేనాని ప్రశ్న

Webdunia
సోమవారం, 9 మే 2022 (07:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. కానీ, రాష్ట్రంలో అపుడే పొత్తుల అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌కు వైకాపా నేతలు సవాళ్ళు విసురుతున్నారు. పవన్‌కు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలంటూ వైకాపా నేతలు పోటీపడుతూ రంకెలు వేస్తున్నారు. వీరికి పవన్ కల్యాణ్ కూల్‌గా సమాధానమిచ్చారు. తనను ఒంటరిగా పోటీ చేయమనడానికి వైకాపా నేతలు ఎవరు అంటూ సూటిగా సుత్తిలేకుండా ప్రశ్నించారు. 151 సీట్లు ఇచ్చింది ప్రజలను హింసించడానికా అంటూ నిలదీశారు. ఈ దఫా 15 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. 
 
ఆయన ఆదివారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాజకీయాల్లో పౌరుషాలు ఉండవని, వ్యూహాలు, ఎత్తుగడలే ఉంటాయని వైకాపా నేతలకు తెలియజెప్పారు. జనసేనను ఒంటరిగా పోటీ చేయాలని అడిగేందుకు మీరు ఎవరు అంటూ ఆయన నిలదీశారు. ప్రజలు కన్నీటిని తుడవని ప్రభుత్వం ఎందుకు అని చెప్పారు. 
 
రాష్ట్ర విభజన దెబ్బలు ఇంకా తగులుతూనే ఉన్నాయన్నారు. తనపై కేసులు లేవు గనుక ఢిల్లీలో ధైర్యంగా మాట్లాడానని చెప్పారు. ఇతరుల జెండాలు, అజెండాలు మోయబోనని స్పష్టం చేశారు. వైకాపా వ్యతిరేక ఓటు చీలితో రాష్ట్రానికి అంధకారమేనని చెప్పారు. వైకాపా మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. అందుకే మీ తరపున పోరాడేందుకు తనను ఆశీర్వదించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

రామోజీ ఫిల్మ్ సిటీ అద్భుతం.. 2వేల ఎకరాలు.. 2500 సినిమాలు

వెకేషన్‌లో మెహ్రీన్.. ఓవర్ డోస్ గ్లామర్ షో.. ఫోటోలు వైరల్

ఉషాకిరణ్ సంస్థకు గౌవరం సమాజ కథలను వెలికి తీసిన ఘనత రామోజీరావుదే

చిత్ర సీమలో ఉషోదయ కిరణాలను ప్రసరింప చేశారు : నందమూరి బాలకృష్ణ

జగన్ అరాచకాల మనోవేదనతోనే రామోజీరావు ఆరోగ్యo క్షీణించింది: నిర్మాత నట్టి కుమార్

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024: గర్భిణీ తల్లులకు సురక్షితమైన ఆహార చిట్కాలు

చెరకు రసంతో ప్రయోజనాలు సరే.. అలాంటి వారికి ఇక్కట్లే..

మజ్జిగ ఇలాంటివారు తాగకూడదు, ఎందుకంటే?

మలబార్ స్పెషల్.. మత్తి చేపల పులుసు.. మహిళలకు ఎంత మేలంటే?

తర్వాతి కథనం
Show comments