Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మగ్లర్ వీరప్పన్‌కు సీఎం జగన్‌కు తేడా లేదు : పవన్ కళ్యాణ్

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2023 (22:31 IST)
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం తేడా లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. స్మగ్లర్ వీరప్పన్ అమాయకులైన గిరిజన ప్రజలతో గంధపు చెక్కలను నరికి స్మగ్లించే చేయించేవారన్నారు. నిజానికి గంధపు చెక్కలు నరకడం నేరమని గిరిజన ప్రజలకు తెలియదన్నారు. అలాంటి పనినే జగన్ వాలంటీర్లతో చేయిస్తున్నారని అన్నారు. ప్రజల వ్యక్తిగత వివరాలు, డేటాను సేకరించడం తీవ్రమైన నేరమన్నారు. ఈ పనిని సీఎం జగన్ చేయిస్తున్నారని, అందువల్ల వాలంటీర్లు ఖచ్చితంగా చిక్కుల్లో పడతారని చెప్పారు. 
 
విశాఖలో జరిగిన వారాహి మూడో దశ యాత్రలో ఆయన ప్రసంగిస్తూ, ఏపీలో ప్రజల డేటా దుర్వినియోగమవుతుందని చెప్పారు. దీనికి కారణం వాలంటీర్ వ్యవస్థేనని చెప్పారు. వాలంటీర్లకు ఓటీపీలతో పనేంటి అని ప్రశ్నించారు. ఓటీపీ అడిగి మొన్న రాజమండ్రిలో డబ్బు దోచుకునే ప్రయత్నం చేశారన్నారు. కొయ్యలగూడెంలో ఒక వాలంటీర్ మహిళ వేలిముద్రతో బ్యాంకు ఖాతా నుంచి రూ.1.70 లక్షలు విత్ డ్రా చేసుకున్ని కాజేశాడని చెప్పారు. పెందుర్తిలో ఒక వాలంటీర్ వృద్ధురాలిని చంపి నగలు దోచుకున్నారన్నారు. అసలు వ్యక్తిగత డేటాను సేకరించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు.
 
అదేసమయంలో తాను వాలంటీర్ వ్యవస్థలోని లోపాల గురించి మాట్లాడుతుంటే వైకాపా నేతలు మరోలా వక్రీకరిస్తున్నారన్నారు. సింహాద్రి అప్పన్న సాక్షిగా చెబుతున్నా.. వాలంటీర్ల పొట్టకొట్టాన్నది తన ఉద్దేశం కాదన్నారు. అవసరమైతే మరో రూ.5 వేలు అదనంగా ఇచ్చే వ్యక్తిని తాను. కానీ, మీతో జగన్ తప్పు చేయిస్తున్న విషయాన్ని గుర్తించండి. ఈ విషయాన్నే తాను ఎత్తి చూపుతున్నాను. ప్రజల నుంచి సేకరించిన ఆధార్, బ్యాంకు, ఇతర వివరాలను నానక్ రామ్ గూడలోని ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీకి ఎందుకు అప్పగించారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments