జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం హనుమాన్ విజయోత్సవం నాడు పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురంలో నామినేషన్ వేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట భారీగా అభిమానులు, జనసైనికులు, ప్రజలు ర్యాలీగా బయలుదేరారు. వారిలో ఓ వృద్ధుడు పవన్ కల్యాణ్ ను ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ గారు అవసరం, అందుకోసం నా ప్రాణం ఇవ్వమన్నా యిస్తానని అన్నారు. పిఠాపురం ప్రజానీకం ఆయన్ని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలి అంటూ విజ్ఞప్తి చేసారు.
పవన్ నామినేషన్ సందర్భంగా ప్రజలు, అభిమానుల ఆయన వెంట సుమారు 7 కిలోమీటర్లు మేర అనుసరించారు. పవన్ అభిమానులు, ప్రజల స్పందన Xలో చూడండి.