Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ - సంఘీభావం తెలిపిన జనసేనాని

Webdunia
ఆదివారం, 8 జనవరి 2023 (12:39 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసానికి సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం వెళ్లారు. హైదరాబాద్ నగరంలో వీరిద్దరి భేటీ జరిగింది. తన నివాసానికి వచ్చిన పవన్‌కు చంద్రబాబు ఇంటి గుమ్మం వద్దకు ఎదురెళ్ళి స్వాగతం పలికారు. వీరిద్దరూ ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. 
 
ముఖ్యంగా, ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పం పర్యటన సందర్భంగా వైకాపా ప్రభుత్వం తెచ్చిన నల్ల జీవో నంబర్ 1ని సాకుగా చూపి చిత్తూరు జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. చంద్రబాబు పర్యటనను అడుగడుగునా అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబును పవన్ కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు కుప్పంలో పోలీసులు సృష్టించిన అరాచకాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక బలోపేతానికి ఐక్య కార్యాచరణ రూపొందించే అంశంపై వీర్దదరూ చర్చించనున్నట్టు తెలుస్తోంది. 
 
కొన్ని నెలల క్రితం విజయవాడలోని ఓ హోటల్‌లో సమావేశమైన వీరిద్దరు ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు, నిర్ణయాలపై ఐక్యంగా పోరాటం చేయాలని ఇప్పటికే వీరిద్దరూ నిర్ణయించిన విషయంతెల్సిందే. ఇపుడు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1పై తాజా భేటీలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments