వ్యక్తిగత లాభం చూసుకోలేదు... రాపాక ఉన్నాడో లేదో తెలియదు : పవన్ కళ్యాణ్

Webdunia
ఆదివారం, 2 ఫిబ్రవరి 2020 (09:43 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నడు కూడా వ్యక్తిగత లాభం చూసుకోలేదన్నారు. అలా అనుకునివుంటే భారతీయ జనతా పార్టీలో చేరి పదవులు అనుభవించేవాడినని చెప్పుకొచ్చాడు. పైగా, తన పార్టీ తరపున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఉన్నాడో లేదో తెలియదన్నారు.
 
మంగళగిరిలో విజయవాడ తూర్పు, నరసరావుపేట నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చి గుర్తింపు పొందిన వారు, ఇప్పుడు తన పద్ధతి బాగాలేదంటూ విమర్శలు గుప్పించి వెళ్లిపోతున్నారని, అటువంటి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదంటూ పరోక్షంగా సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 
 
అలాగే, ఎవరికీ కాపలా కాస్తూ తాను ఉండలేనని, ఎవరి మోచేతి నీళ్లూ తాగబోనని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు తప్పుమీద తప్పు చేయగా, ఇప్పుడు వైసీపీ సర్కారు నియమించిన గ్రామ వాలంటీర్లు సైతం అదే పని చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యర్థి పార్టీకి ఓటు వేశారని ఆరోపిస్తూ, రేషన్ కార్డులు, ఇళ్లపట్టాలను ఇవ్వడం లేదని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు దగ్గర చేసిన సంక్షేమ పథకాలకు 70 శాతం నిధులను కేంద్రమే ఇస్తోందని, వాటిని దారి మళ్లిస్తున్నారని చెప్పారు.
 
తనపై ఆధారపడిన కుటుంబాలను పోషించేందుకే తిరిగి సినిమాలు చేయాలని నిర్ణయించానే తప్ప, సినిమాలంటే ఇష్టంతో కాదని, అడ్డదారుల్లో సంపాదించే డబ్బు తనకు అక్కర్లేదన్నారు. అసలు వ్యక్తిగత లాభాన్ని చూసుకుని ఉండుంటే, జనసేన పార్టీ పెట్టుండే వాడిని కాదని, బీజేపీలో చేరివుంటే కోరుకున్న పదవులు లభించి వుండేవని, వాటిని అనుభవిస్తూ ఉండేవాడినంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: ది గర్ల్ ఫ్రెండ్ నుంచి కురిసే వాన.. లిరికల్ సాంగ్ రిలీజ్

Rohit Nara:.నటి సిరి లెల్లాతో రోహిత్ నారా వివాహం హైదరాబాద్ లో జరిగింది

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments