చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఠాగూర్
శుక్రవారం, 1 నవంబరు 2024 (19:01 IST)
వైకాపా నేతలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరిక చేశారు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా వైకాపా నేతల తీరు ఉందని, వారికి తగిన శాస్తి చేయకతప్పదని ఆయన హెచ్చరించారు. ఎన్డీయే కూటమి నేతలను, ఆడబిడ్డలను లక్ష్యంగా చేసుకుని ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తే సహించే ప్రసక్తే లేదని, ఈ మాట ఒక పవన్ కళ్యాణ్‌గా చెప్పడం లేదని, ఏపీ ఉప ముఖ్యమంత్రిగా చెబుతున్నట్టు తెలిపారు. అలాగే, పదేపదే ఓజీ.. ఓజీ అని అరిచేబదులు.. భగవంతుని నామస్మరణ చేయాలని ఆయన తన అభిమానులకు సూచించారు. సినిమా అనేది సరదా కోసమే ఉండాలని, అది జీవిత వ్యసనంగా ఉండరాదన్నారు. సినిమాలు చూడటానికైనా డబ్బులు కావాలి కదా అని ప్రశ్నించారు. 
 
ఆయన మంగళవారం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ యాగశాలలో నిర్వహించిన సుదర్శన నరసింహ ఆంజనేయ సుబ్రమణ్య హోమం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు పవన్‌కు ఆశీర్వాదం అందించారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా 11 సీట్లకే పరిమితమైనా వైకాపా నాయకుల నోళ్లు ఆగడం లేదని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఆడబిడ్డలను కించపరిస్తే చూస్తూ ఊరుకోబమని తేల్చి చెప్పారు. ఆడబిడ్డల భద్రత విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. అలాగే, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలకు రక్షణ కల్పిస్తామని తెలిపారు.  

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments