Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేసిన జనసేన నేతలు.. కేసు నమోదు

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2022 (15:05 IST)
సినీ నటుడు, వైకాపా నేత, ఏపీ చలనచిత్ర అభివృద్ధి మండలి ఛైర్మన్ పోసాని కృష్ణమురళిపై జనసైనికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు ఆ పార్టీకి చెందిన వీరమహిళలను కించపరిచేలా పోసాని వ్యాఖ్యలు చేశారంటూ జనసైనికులు ఆరోపించారు. ఇదే అంశంపై వారు రాజమండ్రి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు పోసానిపై 354, 355, 500, 504, 506, 507, 509 సెక్షన్ల కేసు నమోదు చేశారు. 
 
తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి పోసాని కించపరిచేలా, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజమండ్రి ఒకటో నంబరు పోలీస్ స్టేషన్‌లో తొలుత ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి... కేసు నమోదు చేయలేదు. 
 
దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. జనసైనికులు వేసిన పిటిషిన్‍‌పై విచారణ జరిపిన కోర్టు... జనసేనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. పోసానిపై తక్షణం కేసు నమోదు చేయాలంటూ పోలీసులను కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయక తప్పలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments