Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తిన బాటపట్టిన పవన్ కళ్యాణ్ - రేపు ఢిల్లీకి సీఎం జగన్

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (08:02 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సినీ నటుడు పవన్ కళ్యాణ్ హస్తిన బాటపట్టారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్‌లో ఉండగా, రేపు ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. కాగా అటు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలు హస్తినబాట పట్టారు.
 
కొత్త పీసీసీ చీఫ్‌ను.. కొత్త కమిటీలను ప్రకటించిన తర్వాత తొలిసారి అందరితో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్‌ గాంధీతో టి.కాంగ్రెస్‌ నేతలు భేటీ కానున్నారు. 
 
ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఇపుడు ఆసక్తిని రేపుతోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. మొదట ప్రహ్లాద్ జోషితో సమావేశంకానున్న ఆయన.. ఆ తర్వాత తన పర్యటనలో పలువురు బీజేపీ ముఖ్యనేతలతో భేటీ అవుతారని తెలుస్తోంది. 
 
ఇదిలావుంటే, ఢిల్లీలో తెరాస భవన్ నిర్మాణ ప్రారంభోత్సవానికి ఈ నెల ఒకటో తేదీన వెళ్లిన సీఎం కేసీఆర్... వారం రోజులుగా అక్కడే మకాం వేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షా.. కేంద్రమంత్రులు నితిన్‌ గడ్కరీ, గజేంద్ర సింగ్ షెకావత్‌ తదితరలను కలిశారు. వారం రోజుల తర్వాత బుధవారం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments