అమ్మా... మీ ముఖంలో మళ్లీ నవ్వు కనిపించేలా మేమంతా కలిసి పని చేస్తాం : పవన్ కళ్యాణ్

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (11:36 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ హామీ ఇచ్చారు. అమ్మా... మీరు ఎలా ఉన్నారు.. మీ ముఖంలో మళ్లీ నవ్వు కనిపించేలా మేమంతా కలిసి పనిచేస్తాం అని హామీ ఇచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ గురువారం కలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన జైలు వెలుపల మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత రాజమండ్రి జైలుకు సమీపంలోనే బస చేస్తున్న చంద్రబాబు కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలుకరించి పరామర్శించారు. 
 
ఈ సందర్భంగా నారా భువనేశ్వరితో మాట్లాడుతూ, రాజకీయాలకు దూరంగా ఉండే మీపైనా వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులు వ్యాఖ్యలు చేయడం, దూషణలకు దిగడం ఎంతో ఆవేదన కలిగించిందన్నారు. శాసనసభ సాక్షిగా మిమ్మల్ని అవమానిస్తే చాలా బాధపడ్డానని చెప్పారు. రాష్ట్రంలో మరే మహిళా ఇలాంటి ఇబ్బంది పడకుండా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 
 
"అమ్మా.. మీ ముఖంలో మళ్లీ నవ్వు కనిపించేలా మేమంతా కలిసి పని చేస్తా"మని భువనేశ్వరికి జనసేనాని భరోసా ఇచ్చారు. చంద్రబాబు కుశలమేనని, ఆందోళన చెందవద్దని ఆమెకు ధైర్యం చెప్పారు. ప్రజలు మన పక్షానే ఉన్నారని, న్యాయమే గెలుస్తుందని ఆయన అన్నట్లు సమాచారం. క్లిష్ట సమయంలో మద్దతుగా నిలిచిన పవన్ కల్యాణ్‌కు భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments