Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ తండ్రికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు... పవన్ కళ్యాణ్ కన్నీరు

రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మృతి చెందడంపై జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదని అన్నారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి వెళ్లి నిషిత్ మృతదేహాన్ని

Webdunia
బుధవారం, 10 మే 2017 (14:30 IST)
రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మృతి చెందడంపై జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదని అన్నారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి వెళ్లి నిషిత్ మృతదేహాన్ని సందర్శించి కళ్లనీళ్లు పెట్టుకున్నారు. నిషిత్ మృతదేహం వద్ద రోదిస్తున్న నారాయణ కుటుంబ సభ్యులను పవన్ కల్యాణ్ ఓదార్చారు.
 
అనంతరం పవన్ మాట్లాడుతూ... ఎంతో భవిష్యత్ ఉన్న యువకుడు నిషిత్ ఇలా అర్థంతరంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తనను కలచివేసిందన్నారు. చెట్టంత కుమారుడు కళ్లెదుటే కనుమరుగయ్యే పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదని ఆయన అన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అంతా కలిసికట్టుగా ప్రయత్నం చేయాల్సి వుందన్నారు. నిషిత్, అతడి స్నేహితుడు వర్మ కుటుంబ సభ్యులకు తమ జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments