Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవో నం.1పై చర్చ కోరితే టీడీపీ సభ్యులపై దాడి చేస్తారా? పవన్ కళ్యాణ్ ప్రశ్న

Webdunia
సోమవారం, 20 మార్చి 2023 (16:22 IST)
ఏపీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఏడో రోజైన సోమవారంలో అసెంబ్లీ సాక్షిగా టీడీపీకి చెందిన దళిత ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామిపై వైకాపా ఎమ్మెల్యే సుధాకర్‌తో పాటు మరికొందరు దాడి చేసినట్టు సమాచారం. ఈ దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. జీవో నం.1పై చర్చ కోరితే టీడీపీ సభ్యలపై దాడి చేస్తారా అంటూ ఆయన మండిపడ్డారు. 
 
ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలను దురదృష్టకరమైనవి, ప్రజూస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేవిగా ఉన్నాయన్నారు. ప్రజల గొంతు నొక్కే జీవో నంబర్ 1పై చర్చను కోరిన టీడీపీ ఎమ్మెల్యేలపై అధికారపక్షం దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై దాడిని ప్రజాస్వామ్యవాదులంతా ముక్తకంఠంతో ఖండించాలని ఆయన కోరారు. 
 
ఇలాంటి ఘటనలో ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తాయన్నారు. ముందుగా చట్ట సభల గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత సభా నాయుకుడిగా ముఖ్యమంత్రిపైనా, సభ ప్రిసైండిగ్ అధికారిపైనా ఉందని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.9 కోట్ల బ‌డ్జెట్‌కు రూ.24.5 కోట్లు సాధించిన‌ కమిటీ కుర్రోళ్లు కు రెండు సైమా అవార్డులు

డాక్యుమెంటరీ నియమాల్ని బ్రేక్ చేసి అద్భుతంగా తీశారు : దర్శకుడు కరుణ కుమార్

Vishal: మగుడంకు దర్శకుడిగా మారిన విశాల్?

సినిమా, పర్యాటక రంగాలకు జీఎస్టీ స్లాబు ఊతం :కందుల దుర్గేష్

లిటిల్ హార్ట్స్ సక్సెస్ అవుతుందని ముందే చెప్పా : మౌళి తనుజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments