Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడికత్తి దాడిపై నానా హంగామా.. బాబాయ్ చనిపోతే జగన్?: పవన్

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (13:28 IST)
కోడికత్తి దాడిపై నానా హంగామా చేసిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి.. సొంత బాబాయ్ వివేకా హత్యకు గురైతే మౌనంగా ఎందుకు వున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. హత్యారాజకీయాలు చేసేవారు అధికారంలోకి వస్తే... రాష్ట్రం ఏమవుతుందో అనే భయం తనను వెంటాడుతోందని వ్యాఖ్యానించారు. 
 
ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి తన సొంత బాబాయి హత్యకు గురైతే దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదని, అది మీకు తెలియదా? నేనైతే నమ్మడంలేదని జనసేనాని తెలిపారు. సొంత మనిషి చనిపోయినా అదేమంత పెద్ద విషయం కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

ఓటు వేసే ముందు ప్రజలు అన్ని విషయాలను ఆలోచించాలని... ఎవరి హయాంలో మేలు జరిగింది, ఎవరి హయాంలో అవినీతి, ఘోరాలు జరిగాయో బేరీజు వేసుకోవాలని పవన్ సూచించారు.  
 
జనసేనలో చేరుతామని కొందరు నేతలు వచ్చారు. కానీ తర్వాత వైకాపాలోకి వెళ్లారని పవన్ గుర్తుచేశారు. వీరంతా వైకాపాలోకి వెళ్లేందుకు కారమంగా హైదరాబాదులో వారికి ఆస్తులు వుండటమేనని తెలియవచ్చిందన్నారు.

ఆస్తులకు సంబంధించి తమకు సమస్యలు ఉన్నాయని వారు చెప్పారని తెలిపారు. జరుగుతున్నవన్నీ గమనిస్తుంటే... అసలు రాజకీయం అర్థమవుతోందని చెప్పారు. నాయకులను బెదిరించి రాజకీయాలు చేయడం సరికాదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments