Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైడ్రాపై పవన్ వ్యాఖ్యలు.. సూపర్ అంటూ కితాబు

సెల్వి
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (16:04 IST)
పొరుగు రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్‌, బఫర్ల జోన్ల పరిరక్షణమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన హైడ్రా అభినందనీయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
హైడ్రా లాంటివి ప్రతి రాష్ట్రంలో ఖచ్చితంగా ఉండాలని తెలిపారు. ఇప్పటికే కట్టిన భవనాలకు పరిహారం ఇచ్చి కూల్చివేయాలని, ఆ విషయంలో మానవతా కోణంలో కూడా చూడాలని అన్నారు.
 
నిజంగా సీఎం రేవంత్‌రెడ్డి చెరువుల విషయంలో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. అసలు అక్రమ నిర్మాణాలు అనేవి జరగకుండా అడ్డుకుంటే ఎలాంటి సమస్యలు ఉపద్రవాలు రావని అన్నారు. 
 
వరద రావడం లేదనే ఉద్దేశంతో తెలంగాణలోనే కాక ఏపీలో కూడా ఎంతో మంది పరివాహక ప్రాంతాలను ఆక్రమించి ఇళ్లు కట్టుకున్నారని పవన్ చెప్పారు. ఇందుకు ఒకరు కారణం కాదని.. ఎంతో మంది వ్యక్తులు ఎన్నో ఏళ్లుగా ఇలా ఆక్రమణలకు పాల్పడడం వల్లే ప్రస్తుతం వరదలు వస్తున్నాయని పవన్ కల్యాణ్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anil Ravipudi: ఐదుగురు కుర్రాళ్లు భూతానికి, ప్రేతానికి చిక్కితే ఏమయింది...

Sreeleela: మాస్ జాతర చిత్ర విడుదలతేదీని ప్రకటించిన నిర్మాత నాగ వంశీ

Naga vamsi: ఓజీ హైప్ అయిపోయింది, అంతా ఉత్సాహంగా ఉంది అంటున్న నాగవంశీ

CM: కర్నాటక ముఖ్యమంత్రిని, సూపర్ స్టార్ సుదీప్ ను కలిసిన మంచు మనోజ్

OG: ఓజీ కోసం థియేటర్లు వదులుకున్న ఓ నిర్మాత - పబ్లిసిటీచేస్తున్న మరో నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

Navratri Snacks: నవరాత్రి స్నాక్స్.. సగ్గుబియ్యం టిక్కా.. అరటి పండ్ల చిప్స్ సింపుల్‌గా..

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

తర్వాతి కథనం
Show comments