Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రియాశీలక సభ్యత్వ నమోదుకు జనసేనాని పిలుపు

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (18:31 IST)
మరో రెండేళ్ళలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అంశంపై దృష్టిసారించారు. ముఖ్యంగా, పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదుకు ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ సభ్యత్వ నమోదు చేపట్టాలని ఆయన కోరారు. ఇందుకోసం జనసైనికులు, వీర మహిళలకు విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. 
 
ఈ నెల 21వ తేదీ నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆయన ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 2 వేల మంది క్రియాశీలక సభ్యత్వం నమోదయ్యేలా జనసైనికులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతోందని, దీన్ని మరింతగా పటిష్టం చేయాలని ఆయన కోరారు. 
 
ఇకపోతే, గతంలో జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి బీమా సౌకర్యం కల్పించామని, లక్ష మందికి ఈ సౌకర్యం వర్తింపజేశామని తెలిపారు. చనిపోయిన కార్యకర్తలకు అండగా నిలిచామని పపన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అదువల్ల ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొని, భారీ ఎత్తున సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments