Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రియాశీలక సభ్యత్వ నమోదుకు జనసేనాని పిలుపు

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (18:31 IST)
మరో రెండేళ్ళలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అంశంపై దృష్టిసారించారు. ముఖ్యంగా, పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదుకు ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ సభ్యత్వ నమోదు చేపట్టాలని ఆయన కోరారు. ఇందుకోసం జనసైనికులు, వీర మహిళలకు విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. 
 
ఈ నెల 21వ తేదీ నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆయన ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 2 వేల మంది క్రియాశీలక సభ్యత్వం నమోదయ్యేలా జనసైనికులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతోందని, దీన్ని మరింతగా పటిష్టం చేయాలని ఆయన కోరారు. 
 
ఇకపోతే, గతంలో జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి బీమా సౌకర్యం కల్పించామని, లక్ష మందికి ఈ సౌకర్యం వర్తింపజేశామని తెలిపారు. చనిపోయిన కార్యకర్తలకు అండగా నిలిచామని పపన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అదువల్ల ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొని, భారీ ఎత్తున సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments