Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిడదవోలు జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేశ్.. ప్రకటించిన పవన్ కళ్యాణ్

ఠాగూర్
సోమవారం, 11 మార్చి 2024 (12:43 IST)
ఏపీలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల పోటీ చేసే అభ్యర్థులను ఆయా రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్నాయి. ఇందులోభాగంగా, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు అసెంబ్లీ నుంచి జనసేన - టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ నేత కందుల దుర్గేశ్ పోటీ చేస్తారని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఆయన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ తరపున ఆయన నిడదవోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. 
 
కాగా, ఇప్పటికే నెల్లిమర్ల అసెంబ్లీ స్థానం నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణల పేర్లను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. తొలి జాబితాలో జనసేన ఐదుగురు పేర్లను ప్రకటించగా, టీడీపీ 94 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. మరోవైపు, టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య కుదిరిన పొత్తులో భాగంగా, జనసేన - బీజేపీ పార్టీలకు 8 లోక్‌సభ, 30 అసెంబ్లీ స్థానాలను కేటాయించినట్టు తెలుస్తుంది. అయితే, ఈ సీట్ల పంపిణీపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments