Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ నేతల చర్మం ఏనుగు చర్మంలా తయారైంది : పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార తెలుగుదేశం పార్టీతో పాటు.. దాని మిత్రపక్షమైన బీజేపీలకు చెందిన ఎంపీలను లక్ష్యంగా చేసుకుని ఘాటైన విమర్శలు గుప్పించారు.

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2017 (08:39 IST)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార తెలుగుదేశం పార్టీతో పాటు.. దాని మిత్రపక్షమైన బీజేపీలకు చెందిన ఎంపీలను లక్ష్యంగా చేసుకుని ఘాటైన విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, బీజేపీ ఎంపీ కె.హరిబాబు, గోకరాజు గంగరాజు, టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్, అశోక గజపతిరాజుల పేర్లను ప్రస్తావిస్తూ వారికి బహిరంగ హెచ్చరిక చేశారు. 
 
జనసేన ఆధ్వర్వంలో ‘చలోరే...చలోరే చల్‌’ కార్యక్రమంలో భాగంగా విశాఖ పోర్టు ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పవన్ పాల్గొని ప్రసంగించారు. ఎంపీలకు ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలు పట్టడం లేదన్నారు. వారికి తాను పిడికెడు మట్టితో సమానమని, ఆ మట్టి ఏమి చేయగలదో చూపిస్తానని హెచ్చరించారు. నేటి నేతల చర్మం ఏనుగు చర్మంలా తయారైందని, అలాంటి వారికి ప్రజలు అంకుశమనే ఓటుతోనే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
 
కొందరు మంత్రులు, ఎంపీలు వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసి నిస్సిగ్గుగా.. దర్జాగా తిరుగుతున్నారని, వారిని వదిలేసి పంట రుణం తీసుకొని కట్టడం లేదని పేద రైతులను వేధించడం ఏ విధంగా సమంజసమని పవన్‌ ప్రశ్నించారు. ఎవరినీ వెనకేసుకొచ్చే అవసరం తనకు లేదని, రక్త సంబంధీకులైనా బయటి వారైనా ఒకలాగే వ్యవహరిస్తానన్నారు. 2019లో ఎన్నికలు వస్తున్నాయని, నేతలంతా ఓట్ల కోసం అంతా రోడ్లపైకి వస్తారని, తప్పకుండా వారిని నిలదీస్తామని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments