Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశీపట్నం సమీపంలో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (14:55 IST)
విశాఖపట్టణం నుంచి కిరండోల్‌కు వెళుతున్న ప్యాసింజర్ రైలు ఒకటి కిరండోల్ వద్ద పట్టాలు తప్పింది. అనంతగిరి మండలం కాశీపట్నం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన రైలు డ్రైవర్ రైలును నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సాంకేతిక సిబ్బంది సాయంతో ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. అయితే, ఈ ప్రమాదంలో ఏ ఒక్కరికీ ఎలాంటి చిన్నపాటి గాయం కూడా కాలేదు.
 
ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు స్పందిస్తూ, చలికాలం దృష్ట్యా ఇలాంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలిపారు. పండుగల సెలవుల కారణంగా విశాఖ, అరకులోయకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం, ఇందులో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments