Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్నాడు జిల్లా : వైకాపా నేత గడ్డి వాములో పెట్రోల్ బాంబులు!!

ఠాగూర్
గురువారం, 30 మే 2024 (10:38 IST)
పల్నాడు జిల్లాలో వైకాపా నేతకు చెందిన గడ్డి వాములో దాచిపెట్టిన పెట్రోల్ బాంబులను గుర్తించారు. ఈ గ్రామంలో బుధవారం పోలీసులు తనిఖీలు చేశారు. ఆ సమయంలో గడ్డి వాములో దాచిన పెట్రోల్ బాంబులను గుర్తించారు. మొత్తం నాలుగు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో గ్రామంలో భయాందోళన నెలకొంది. కౌంటింగ్‌ రోజు అలజడులు సృష్టించేందుకు వాటిని దాచి ఉంచారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 
 
ఇదే గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్‌ 21న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సోదరి రోడ్డుషో నిర్వహిస్తుండగా వైకాపా వర్గీయులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. రోడ్డుకు అడ్డంగా వైకాపా ప్రచార వాహనాలను నిలిపి.. ఇదేమిటని అడిగిన టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. అదేరోజు రాత్రి రెండింటి ప్రాంతంలో గ్రామంలోని టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఇప్పటికైనా గ్రామంలో అల్లర్లకు పాల్పడేవారిని బైండోవర్‌ చేయకపోతే కౌంటింగ్‌ రోజు దాడులు చేసే అవకాశముందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. గడ్డివాము పరిసరాల్లోని నివాసితులను విచారిస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్సై రాజేష్‌ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments