అక్కంపల్లి రిజర్వాయర్ వద్ద బర్డ్ ఫ్లూ కేసులు - భయం గుప్పెట్లో భాగ్యనగరి వాసులు

ఠాగూర్
ఆదివారం, 16 ఫిబ్రవరి 2025 (11:15 IST)
తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ విజృంభించింది. దీంతో ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విపరీతంగా కోళ్లు చనిపోతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలోని అక్కంపల్లి రిజర్వాయర్‌లో వందల సంఖ్యలో చనిపోయిన కొళ్లు కొట్టుకుని వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ కోళ్లను ఈ రిజర్వాయర్‌లో పడేసినట్టు సాచారం. హైదరాబాద్, నల్గొండ జిల్లాలకు ఈ రిజర్వాయర్ నుంచే తాగునీటిని సరఫరా చేస్తుంటారు. దీంతో ఆ ప్రాంత వాసులు బర్డ్ ఫ్లూ భయంతో వణికిపోతున్నారు. 
 
ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ దీనిపై విచారణకు ఆదేశించారు. నల్గొండ ఎస్పీ శరత్ చంద్రా దర్యాప్తును చేపట్టారు. దేవరకొండ ఆర్డీవో, నీటిపారుదల శాఖ అధికారులు రిజర్వాయర్‌ను పరిశీలించారు. బర్డ్ ఫ్లూ కేసులు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరింత భయాందోళనకు గురిచేస్తుంది. రిజర్వాయర్‌లో చచ్చిన కోళ్లను పడేసిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నీటి శాంపిల్స్ సేకరించిన అధికారులు వాటిని పరీక్షలకు పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments