Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కంపల్లి రిజర్వాయర్ వద్ద బర్డ్ ఫ్లూ కేసులు - భయం గుప్పెట్లో భాగ్యనగరి వాసులు

ఠాగూర్
ఆదివారం, 16 ఫిబ్రవరి 2025 (11:15 IST)
తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ విజృంభించింది. దీంతో ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విపరీతంగా కోళ్లు చనిపోతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలోని అక్కంపల్లి రిజర్వాయర్‌లో వందల సంఖ్యలో చనిపోయిన కొళ్లు కొట్టుకుని వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ కోళ్లను ఈ రిజర్వాయర్‌లో పడేసినట్టు సాచారం. హైదరాబాద్, నల్గొండ జిల్లాలకు ఈ రిజర్వాయర్ నుంచే తాగునీటిని సరఫరా చేస్తుంటారు. దీంతో ఆ ప్రాంత వాసులు బర్డ్ ఫ్లూ భయంతో వణికిపోతున్నారు. 
 
ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ దీనిపై విచారణకు ఆదేశించారు. నల్గొండ ఎస్పీ శరత్ చంద్రా దర్యాప్తును చేపట్టారు. దేవరకొండ ఆర్డీవో, నీటిపారుదల శాఖ అధికారులు రిజర్వాయర్‌ను పరిశీలించారు. బర్డ్ ఫ్లూ కేసులు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరింత భయాందోళనకు గురిచేస్తుంది. రిజర్వాయర్‌లో చచ్చిన కోళ్లను పడేసిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నీటి శాంపిల్స్ సేకరించిన అధికారులు వాటిని పరీక్షలకు పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments