Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కంపల్లి రిజర్వాయర్ వద్ద బర్డ్ ఫ్లూ కేసులు - భయం గుప్పెట్లో భాగ్యనగరి వాసులు

ఠాగూర్
ఆదివారం, 16 ఫిబ్రవరి 2025 (11:15 IST)
తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ విజృంభించింది. దీంతో ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విపరీతంగా కోళ్లు చనిపోతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలోని అక్కంపల్లి రిజర్వాయర్‌లో వందల సంఖ్యలో చనిపోయిన కొళ్లు కొట్టుకుని వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ కోళ్లను ఈ రిజర్వాయర్‌లో పడేసినట్టు సాచారం. హైదరాబాద్, నల్గొండ జిల్లాలకు ఈ రిజర్వాయర్ నుంచే తాగునీటిని సరఫరా చేస్తుంటారు. దీంతో ఆ ప్రాంత వాసులు బర్డ్ ఫ్లూ భయంతో వణికిపోతున్నారు. 
 
ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ దీనిపై విచారణకు ఆదేశించారు. నల్గొండ ఎస్పీ శరత్ చంద్రా దర్యాప్తును చేపట్టారు. దేవరకొండ ఆర్డీవో, నీటిపారుదల శాఖ అధికారులు రిజర్వాయర్‌ను పరిశీలించారు. బర్డ్ ఫ్లూ కేసులు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరింత భయాందోళనకు గురిచేస్తుంది. రిజర్వాయర్‌లో చచ్చిన కోళ్లను పడేసిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నీటి శాంపిల్స్ సేకరించిన అధికారులు వాటిని పరీక్షలకు పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments