Webdunia - Bharat's app for daily news and videos

Install App

నామినేషన్ వేశారనీ.. చేపల చెరువులో విషం కలిపారు... ఎక్కడ?

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (08:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో అధికార వైకాపాకు చెందిన నేతలు, కార్యకర్తల ఆగడాలు మరీ మితిమీరిపోతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేస్తున్న ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులపై దాడులకు దిగుతున్నారు. ఏకంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ బెదిరింపులకు దిగడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం పి.దొంతమూరులో 9వ వార్డుకు తెలుగుదేశం పార్టీ మద్దతుతో కమ్మర సూర్యామణి అనే మహిళ నామినేషన్‌ వేశారు. దీన్ని జీర్ణించుకోలేని వైకాపా కార్యకర్తలు ప్రతీకార చర్యకు పాల్పడ్డారు. 
 
ఆమె భర్త అబ్బులు తమకున్న ఎకరం పొలంలో చేపల చెరువు తవ్వి చేపల పెంపకం నిమిత్తం నక్కబోయిన సన్యాసిరావుకు ఏడాదికి రూ.60 వేలకు లీజుకిచ్చారు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ చెరువులో విషం కలిపారు.
 
దీంతో చేపలు భారీగా చనిపోయి సుమారు రూ.4 లక్షల వరకు నష్టం వాటిల్లింది. దీంతో సన్యాసిరావు భార్య చంద్రకాంతం బుధవారం గుండెపోటుతో మరణించారు. దీంతో కలత చెందిన సూర్యామణి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Atharva Murali: అథర్వ మురళీ యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్ రాబోతోంది

ఐదు రూపాయల కాయిన్ ఎందుకు బ్యాన్ అయింది అనే కథతో చంద్రహాస్ కాయిన్ చిత్రం

Manoj: మా అమ్మ, అక్క కళ్ళల్లో ఆనందం చూశాను : మంచు మనోజ్

Vijay: టాలెంట్ ఉందోలేదో తెలీదు, ఆ డైరెక్టర్ తో వంద దేవుళ్ళు చేస్తున్నా : విజయ్ ఆంటోనీ

హరికథ రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేసిన మంత్రి వాకిటి శ్రీహరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

తర్వాతి కథనం
Show comments