Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనలోకి క్యూకడుతున్న వైకాపా నేతలు!

Webdunia
ఆదివారం, 16 జులై 2023 (16:24 IST)
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. అధికార వైకాపా ప్రభుత్వం పాలనతో విసిగిపోయిన వైకాపా నేతలో పార్టీకి గుడ్‌బై చెప్పేసి ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్ధమైపోతున్నారు. ముఖ్యంగా వైకాపా నేతలు జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే చీరాల వైకాపా ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వామినాయుడు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మరో నేత చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన పేరు పంచకర్ల రమేశ్ బాబు. మాజీ ఎమ్మెల్యే. ఇప్పటివరకు విశాఖపట్టణం వైకాపా అధ్యక్షుడిగా ఉండి, ఇటీవలే రాజీనామా చేశారు. 
 
ఆయన ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత మాట్లాడుతూ, మూడు రోజుల కిందట వైకాపా విశాఖపట్టణం జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశా. ఇపుడు పవన్ కళ్యాణ్ కలిసి పార్టీలో పని చేయాలనుకుంటున్నా. ఈ నెల 20వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఇపుడే పార్టీలో చేరతానని, సామాన్య కార్యకర్తలా పని చేస్తానని తెలిపారు. రాష్ట్ర శ్రేయస్సుకు ఒక సైనికుడిలా పని చేస్తానని పంచకర్ల రమేశ్ బాబు తెలిపారు. 
 
తన అనుభవనాన్ని పార్టీ ఉపయోగించుకుంటుందని పవన్ చెప్పారన్నారు. ఆత్మగౌరవం దెబ్బతినండ వల్లే వైకాపాను వీడినట్టు రమేశ్ వెల్లడించారు. జిల్లా అధ్యక్షుడు కూడా ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక్క రూపాయి సంపాదించానని నిరూపిస్తే గొంతు కోసుకుంటానన్నారు. వైవీ సుబ్బారెడ్డి అంటే తను అపారమైన గౌరవం ఉందన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments