Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జ‌గ‌న్ చిత్ర‌పటానికి పాలాభిషేకం చేసిన బెల్లం దుర్గ‌

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (11:22 IST)
విజ‌య‌వాడ న‌గ‌ర డిప్యూటీ మేయ‌ర్ బెల్లం దుర్గ, సీఎం జ‌గ‌న్ చిత్ర ప‌టానికి పాలాభిషేకం చేశారు. ఆయ‌న అగ్రిగోల్డ్ బాధితుల పాలిట దేముడ‌ని అభివ‌ర్ణించారు. అగ్రి గోల్డ్ బాధితుల ఖాతాల్లో 20 వేల రూపాయ‌లు నగదు జమ చేస్తున్నందుకు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో పాటు ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, వైసీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం జగన్ అండగా నిలవడం ఆనందకరమ‌ని, జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని మరోసారి నిరూపించార‌న్నారు.

జగన్ చేస్తున్న మంచి పనులను పేద ప్రజలు ఎప్పటికి మర్చిపోర‌ని, ఎన్నో సంవత్సరాలు నుంచి ఎదురుచూస్తున్న అగ్రి గోల్డ్ బాధితులకు జగన్ ఇచ్చిన మాట ప్రకారం వారికి అండగా నిలిచార‌ని కొనియాడారు. అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో నగదు వేయటం ఎన్నటికీ మర్చిపోలేని విషయమ‌ని, జగన్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని పేద ప్రజల‌కు గట్టి నమ్మకం ఏర్ప‌డింద‌ని అన్నారు.

జగన్ చేస్తున్న మంచి పని వలన అగ్రి గోల్డ్ బాధితులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నార‌న్నారు. సంక్షేమ పథకాలు అమలుతో పాటు, మోసపోయిన పేద ప్రజల సమస్యలను కూడా పరిష్కరం చేస్తున్నార‌ని సీఎంని కొనియాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments