Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు యువకుడు... ఆంధ్రలోని పాడేరు ఏఎస్పీ... కణతలోకి తుపాకి బుల్లెట్... ఆత్మహత్యేనా...?

ఒక పోలీసు అధికారి అనుమానాస్పద స్థితిలో గురువారం మరణించారు. విశాఖ జిల్లా పాడేరు ఎఎస్‌పిగా ఉన్న శశికుమార్ తలలోని కుడివైపు కణతలో నుంచి తుపాకి గుండు దూసుకు వెళ్లడంతో మరణించారు. తొలుత మిస్ ఫైర్ వల్ల ఆయన మరణించి ఉండవచ్చన్న వార్తలు వచ్చాయి. మిస్ ఫైర్ అయితే

Webdunia
గురువారం, 16 జూన్ 2016 (15:55 IST)
ఒక పోలీసు అధికారి అనుమానాస్పద స్థితిలో గురువారం మరణించారు. విశాఖ జిల్లా పాడేరు ఎఎస్‌పిగా ఉన్న శశికుమార్ తలలోని కుడివైపు కణతలో నుంచి తుపాకి గుండు దూసుకు వెళ్లడంతో మరణించారు. తొలుత మిస్ ఫైర్ వల్ల ఆయన మరణించి ఉండవచ్చన్న వార్తలు వచ్చాయి. మిస్ ఫైర్ అయితే బుల్లెట్ మరెక్కడైనా దూసుకెళ్లే అవకాశం ఉందనీ, కానీ ఖచ్చితంగా కణతలోకి బుల్లెట్ దూసుకెళ్లడాన్ని చూస్తే ఇది ఆత్మహత్యేనన్న అనుమానంగా ఉందన్న అభిప్రాయాలు వచ్చాయి. 
 
ఆయన తన ఛాంబర్ లోనే కుప్పకూలిపోయారు. కాల్పుల శబ్దం వినిపించడంతో సిబ్బంది లోపలికి వెళ్లి చూడగా ఆయన రక్తపు మడుగులో ఉన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలోనే మృతి చెందారు. ఆయన భౌతిక కాయాన్ని పాడేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముప్పై ఏళ్ల యువకుడైన శశికుమార్ మూడు నెలల క్రితమే పాడేరులో చేరారు. అంతకు ముందు ఆళ్లగడ్డలో ఆయన పని చేశారు. శశికుమార్ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. కారణాలు తెలియవలసి ఉంది. యువకుడైన ఒక అధికారి మరణించడం దురదృష్టకరం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments