Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలను ప్రభుత్వానికి అప్పగించేందుకు యాజమాన్యాల అంగీకారం

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (07:44 IST)
ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలను ప్రభుత్వానికి అప్పగించేందుకు యాజమాన్యాలు అంగీకారం తెలిపాయి. అనంతర ప్రక్రియపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్  సమీక్షించారు.

సచివాలయం లోని మంత్రి ఛాంబర్ లో జరిగిన సమీక్షకు హాజరైన ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడుతూ.... యాజమాన్యాలు అంగీకారం తెలిపిన వాటిపై చేపట్టాల్సిన తదనంతర ప్రక్రియ పై చర్యలు తీసుకోవాలని అన్నారు.
 
బోధన, బోధనేతర సిబ్బంది సర్దుబాటు ప్రక్రియలో ఏ ఒక్క ఉపాద్యాయుడు లేదా విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు.
 
ఈ సమావేశంలో ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్, ఉన్నత విద్యామండలి కమిషనర్ పోలా భాస్కర్, పాఠశాల విద్య సంచాలకులు వి. చిన్న వీరభద్రుడు, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments