Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళంలో ఎలుగుబంటిని పట్టేశారు...

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (14:51 IST)
గత కొన్ని రోజులుగా భయభ్రాంతులకు గురిచేస్తూ వచ్చిన ఎలుగుబంటిని శ్రీకాకుళం అటవీ శాఖ అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ ఎలుగుబంటు గత కొన్ని రోజులుగా సంచరిస్తూ హల్చల్ చేసింది. దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. దీన్ని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు శతవిధాలా ప్రయత్నించారు. ఇన్ని రోజులు చిక్కకుండా తప్పించుకుని తిరగసాగింది. 
 
ఈ క్రమంలో గన్ సాయంతో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని పట్టుకున్నారు. ఈ ఎలుగుబంటిని జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం కడిసింగిలోని పశువుల పాకలో ఉండగా స్థానికులతో కలిసి అధికారులు బోనులో బంధించారు. 
 
కాగా, ఆదివారం కిడిసింగి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడిపై ఎలుగు దాడి చేయడంతో అతను ప్రాణాలు విడిచాడు. అలాగే, వజ్రపుకొత్తూరు సంతోషిమాత ఆలయంలోని జీడితోటలో పశువుల కోసం రేకుల షెడ్డు వేస్తుండగా ఎలుగుబంటి ఏడుగురిపై దాడి చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఒకరు మృతిచెందగా.. ఆరుగురు శ్రీకాకుళంలోని మెడికేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments