Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాలో వధూవరులు.. కర్నూలులో అంగరంగ వైభవంగా పెళ్లి...

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (11:28 IST)
సాధారణంగా పెళ్లంటే... ఆకాశమంత పందిరి. భూదేవి అంత చాపలు పరిచేసి కోట్లాది రూపాయలు ఖర్చు చేసేది. విందు, చుట్టాలు, వందలాది కాదు వేలాది మందికి భోజనాలు, అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. కొందరు తమ ఇంటిపట్టునే చేసుకుంటే మరికొందరు లక్షలాది రూపాయలు వెచ్చించి కళ్యాణ మండపాలను అద్దెకు తీసుకుంటారు. 
 
కానీ ఇప్పుడు కరోనా దెబ్బకు ప్రతి ఒక్కరి జీవితాలు తలకిందులయ్యాయి. పెళ్లిళ్లే కాదు.. పండుగలు పబ్బాలను కూడా తక్కువ మందితో దగ్గరి స్నేహితులతోనే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఇప్పుడు కరోనా కారణంగా వివాహాలు కూడా ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. చివరికి పెళ్లికొడుకు, పెళ్లి కూతురు ఇద్దరూ మండపంలో లేకున్నా.. పెళ్లి తంతు జరుగుతోంది. ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకొని డిజిటల్లో అందరికీ చూపిస్తున్నారు. ఈ విచిత్ర సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.
 
కర్నూలు జిల్లాకు చెందిన మధుసూదన్ రెడ్డి, శైలజారెడ్డి దంపతుల కుమార్తె రజితకు.. నల్గొండకు చెందిన వెంకట్రామిరెడ్డి, కవిత దంపతుల కుమారుడు దినేష్ రెడ్డితో వివాహం జరిపించాలని రెండేళ్ల క్రితం పెద్దలు నిర్ణయించారు. కానీ రజిత, దినేష్ ఇద్దరూ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నారు. 
 
కరోనా కారణంగా వారు ఆస్ట్రేలియా నుండి భారత్‌కి వచ్చే అవకాశం లేదు. అలాగే రజిత తల్లిదండ్రులు సైతం ఆస్ట్రేలియా వెళ్లలేని పరిస్థితి. ఇప్పటికే కరోనా కారణంగా వివాహం ఆలస్యం కావడంతో ఇక చేసేదేం లేక ఆన్‌లైన్లో తంతు జరిపించారు. 
 
వధూవరులిద్దరూ ఆస్ట్రేలియా నుంచి పెళ్లి చేసుకోగా.. వారి ఆత్మీయులు, బంధుమిత్రులు కర్నూలులోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆన్‌లైన్లో వారి పెళ్లిని తిలకించారు. ఈ ఫంక్షన్‌కు వచ్చిన వారికి పసైందన వంటకాలతో విందు భోజనాలు వడ్డించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments