Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరాతక తండ్రి-రెండోసారీ ఆడశిశువు పుట్టిందని.. తొట్టెలో పడేసి చంపేశాడు..

Webdunia
మంగళవారం, 1 అక్టోబరు 2019 (10:39 IST)
ఆధునికత పెరిగినా.. ఆడశిశువులపై అఘాయిత్యాలకు బ్రేక్ పడటం లేదు. ఉన్నత విద్యలు చదువుకున్నా.. ఆడశిశువులపై కొందరు చిన్నచూపు చూస్తూనే వున్నారు. ఆడపిల్ల పుడితే ఇంట లక్ష్మీదేవీ పుట్టిందని భావిస్తారు. కానీ మరికొందరు ఆడపిల్లను భారంగానే భావిస్తున్నారు. పుట్టకముందే కడుపులోనే కొందరు హతమారుస్తుంటే.. మరికొందరు పుట్టాక పసిప్రాణాల్ని తీసేస్తున్నారు. 
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలాంటి దారుణ ఘటనే వెలుగుచూసింది. చర్ల మండలం రేగుంటలో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. పుట్టి నెలరోజులే అయిన ఆడ శిశువును తండ్రి హతమార్చాడు. రెండో సంతానంగా అమ్మాయి పుట్టిందనే కర్కశంతో నీటి తొట్టెలో పడేసి ప్రాణాలు తీసేశాడు. 
 
తొలి కాన్పులోనూ ఆడబిడ్డ పుట్టగా, రెండో బిడ్డ కూడా ఆడశిశువే జన్మించడంతో అతి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కసాయి తండ్రి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments