కిరాతక తండ్రి-రెండోసారీ ఆడశిశువు పుట్టిందని.. తొట్టెలో పడేసి చంపేశాడు..

Webdunia
మంగళవారం, 1 అక్టోబరు 2019 (10:39 IST)
ఆధునికత పెరిగినా.. ఆడశిశువులపై అఘాయిత్యాలకు బ్రేక్ పడటం లేదు. ఉన్నత విద్యలు చదువుకున్నా.. ఆడశిశువులపై కొందరు చిన్నచూపు చూస్తూనే వున్నారు. ఆడపిల్ల పుడితే ఇంట లక్ష్మీదేవీ పుట్టిందని భావిస్తారు. కానీ మరికొందరు ఆడపిల్లను భారంగానే భావిస్తున్నారు. పుట్టకముందే కడుపులోనే కొందరు హతమారుస్తుంటే.. మరికొందరు పుట్టాక పసిప్రాణాల్ని తీసేస్తున్నారు. 
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలాంటి దారుణ ఘటనే వెలుగుచూసింది. చర్ల మండలం రేగుంటలో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. పుట్టి నెలరోజులే అయిన ఆడ శిశువును తండ్రి హతమార్చాడు. రెండో సంతానంగా అమ్మాయి పుట్టిందనే కర్కశంతో నీటి తొట్టెలో పడేసి ప్రాణాలు తీసేశాడు. 
 
తొలి కాన్పులోనూ ఆడబిడ్డ పుట్టగా, రెండో బిడ్డ కూడా ఆడశిశువే జన్మించడంతో అతి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కసాయి తండ్రి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

Balakrishna: మంచులో మేం సూట్ ధరిస్తే, బాలక్రిష్ణ స్లీవ్ లెస్ లో యాక్షన్ చేశారు : రామ్-లక్ష్మణ్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments