Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే వ్యక్తికి రెండుసార్లు కరోనా.. విశాఖలో జడుసుకుంటున్న జనం

Webdunia
మంగళవారం, 19 మే 2020 (13:38 IST)
కరోనా కేసులు దేశంలో లక్షను దాటాయి. అలాంటి మహమ్మారి కరోనాతో పోరాటం చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. అలాంటిది ఒకే కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి కరోనా వస్తే ఎలా వుంటుంది. ఒకే వ్యక్తికి రెండోసారి కరోనా వస్తే అతని పరిస్థితి ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అలాంటి ఘటనే విశాఖలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. విశాఖలోని ఓ కుటుంబంలో ఓ వ్యక్తికి రెండోసారి కరోనా సోకింది. విశాఖలో ఓ కుటుంబంలో 8 మంది నివసిస్తుంటారు. వీరిలో మొదట ముంబై నుంచి వచ్చిన 30 ఏళ్ల వ్యక్తికి మొదట కరోనా సోకింది. ఏప్రిల్ 1 వ తేదీన కరోనా సోకింది.
 
కాగా, కరోనాకు ట్రీట్మెంట్ తీసుకోవడంతో నయం అయ్యి ఇంటికి వచ్చాడు. ఆ తరువాత ఇంట్లో అందరికి కరోనా సోకింది. ఆ తరువాత మరలా మొదట కరోనా సోకిన వ్యక్తికి తిరిగి కరోనా రావడంతో వైద్య సిబ్బంది షాక్ అయ్యారు.
 
ఒకేసారి వచ్చిన వ్యక్తిలో వైరస్‌ను అడ్డుకోగలిగే యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయని, అవి కరోనాను ఎటాక్ చేసే శక్తిని కలిగి ఉంటాయని వైద్యులు చెప్తుండగా, కరోనా ట్రీట్మెంట్ తీసుకున్న కొన్ని రోజులకే తిరిగి రెండోసారి కరోనా సోకడంతో వైద్యులతోపాటు అటు వైజాగ్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments