Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫార్మాసిటీ అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి!

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (10:43 IST)
విశాఖ పరవాడ రాంకీ ఫార్మాసిటీలో అర్ధరాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. అయితే ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

సాల్వెంట్స్‌ ఫార్మా కంపెనీలోని ట్యాంకు పేలి మంటలు ఎగిసిపడ్డాయి. సాల్వెంట్స్‌ ఫార్మా కంపెనీలో శ్రీణివాస్‌ సీనియర్‌ కెమిస్ట్‌ పని చేస్తున్నారు. ప్రమాద సమయంలో కంపెనీలో నలుగురు సిబ్బంది ఉన్నారు.

తీవ్రంగా గాయపడిన కార్మికుడు మల్లేశ్వరరావును గాజువాక ఆసుపత్రికి తరలించారు. దాదాపు ఐదు గంటలపాటు కష్టపడి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

పరవాడలోని రాంకీ ఫార్మాసిటీలో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. యాజమాన్యం వైఫల్యం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశాయి.

విశాఖ రాంకీ ఫార్మాసిటీలోని ‘విశాఖ సాల్వెంట్స్‌’ సంస్థలో సోమవారం అర్ధరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పందించారు.

పేలుడుకు గల కారణాలను జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన సిబ్బందికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments