Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 8న ఎమ్మార్పీఎస్​ యుద్ధభేరి: మందకృష్ణ

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (22:06 IST)
హత్యలు, హత్యాచారాల ఘటనలపై రాష్ట్ర సర్కారు, పోలీసు యంత్రాంగం అగ్రకులాల విషయంలో ఒక రకంగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించి మరోరకంగా వ్యవరిస్తోందని మందకృష్ణ ఆరోపించారు. దీనిపై పోరాటం చేస్తామని వెల్లడించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన బాలికలు, మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు.

దీన్ని నిరసిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మార్చి 8న 'ఛలో కొంగరకలాన్​-ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీ వర్గాల యుద్ధభేరి' పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.  హైదరాబాద్​లో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్య వేదిక సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాములు నాయక్, మాల మహానాడు జాతీయాధ్యక్షుడు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సభ విజయవంతం కోసం... ఈ నెల 16నుంచి సన్నాహక యుద్ధభేరి భేరి సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా... మార్చ్ 5 వరకు నిర్వహిస్తామని తెలిపారు.

వేదికపై ఎటువంటి రాజకీయ పార్టీలకు ఆహ్వానం ఇవ్వమని... రెండు రోజుల్లో సన్నాహక యుద్ధభేరి సభలపై మరింత స్పష్టత ఇవ్వనున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments