Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ డే... ద‌ళితుల‌పై పాము ప‌గ ప‌ట్టారు బాబు: ఎంపీ నందిగం

Webdunia
శనివారం, 31 జులై 2021 (19:26 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఈ రోజు బ్లాక్ డే అని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ వ్యాఖ్యానించారు. పాము పగబట్టినట్లు చంద్రబాబు దళితులపై పగబట్టార‌ని అన్నారు. ఎన్నికల్లో తనను ఓడించారనే కక్షతో ఇలా దాడులు చేయిస్తున్నార‌ని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని నోటికొచ్చినట్లు మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అని, నిజంగా ఈ రోజు ఒక బ్లాక్ డే అని చెప్పారు. దళితులపై దాడి చేసిన దేవినేని ఉమ వంటి వారిని చంద్ర‌బాబు పరామర్శించడం ఏమిటి? అని ప్ర‌శ్నించారు. 
 
నిజాయితీ రాజకీయాలు చేయాలంటే దళితుల వెనుక నిలవాలి కానీ చంద్రబాబు మాత్రం తన నైజాన్ని ఎన్నటికీ మార్చుకోడ‌న్నారు. ఇంక ఎన్ని ఎన్నికలు వచ్చినా దళితులు, బీసీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఈయన్ని నమ్మరు...ప్రతి వర్గానికి అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్య‌బ‌ట్టారు.

మాజీ మంత్రి దేవినేని ఉమ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు గొల్ల‌పూడికి వెళ్ళిన చంద్రబాబును అడ్డుకునేందుకు ద‌ళిత వ‌ర్గాలు అక్క‌డ ప్ర‌య‌త్నించాయి. అయితే, భారీ పోలీసు బందోబ‌స్తు వ‌ల్ల అది సాధ్యం కాలేదు. ఈ చ‌ర్య స‌రికాద‌ని, చంద్ర‌బాబు ద‌ళితుల‌ను రెచ్చ‌గొడుతున్నార‌ని ఎంపీ నందిగం సురేష్ ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments