Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిత్లీతో పంట దెబ్బతిందనీ ఒడిషా రైతు ఆత్మహత్య...

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (14:21 IST)
తిత్లీ తుఫాను అనేక మంది ప్రాణాలను బలితీసుకుంది. అలాగే అపార నష్టాన్ని కూడా మిగిల్చింది. ముఖ్యంగా, రైతులకు తీవ్ర నష్టం చేకూర్చింది. ఫలితంగా ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
 
ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని కాలాహండీ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెత్తే.. రైతు పేరు పరమానంద లహజల్ (26). భార్య నగలు తాకట్టు పెట్టి 35 వేల రూపాయలు వడ్డీకి తీసుకున్నాడు.
 
ఆ డబ్బుతో నాలుగు ఎకరాల పొలంలో పంట వేశాడు. అయితే, ఇటీవల తిత్లీ తుఫాను సృష్టించిన విధ్వంసానికి పంట పూర్తిగా నీట మునిగిపోయింది. లహజల్ పంట వేసుకుంటే అప్పైనా తీరుతుందని భార్య నగలు పెట్టి మరి డబ్బులు తెచ్చుకున్నాడు. కానీ, ఈ తుఫాన్ వలన అంతా నాశనమైపోయింది.
 
పంట నష్టం జరగడంతో లహజల్ రుణం చెల్లించలేక.. జీవితం భారంగా మారిందనే ఆవేదనతో విషం తాగి పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష కోసం జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments