Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓవోబీలో టెన్షన్.. టెన్షన్.. మావో అగ్ర నేత ఆర్కేను రక్షించిన గన్‌మెన్లు... ముమ్మరంగా గాలింపు

ఆంధ్ర-ఒడిశా బోర్డర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు చెపుతున్నారు. ప్రస్తుతం ఆయన కోసం ఏవోబీలో ముమ్మరంగా క

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (11:44 IST)
ఆంధ్ర-ఒడిశా బోర్డర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు చెపుతున్నారు. ప్రస్తుతం ఆయన కోసం ఏవోబీలో ముమ్మరంగా కూంబింగ్ సాగుతోంది. 
 
మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన నక్సలైట్ల సంఖ్య 31కి చేరింది. పోలీస్ కాల్పుల్లో అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే గన్‌మెన్లు ముగ్గురు మరణించారు. కాల్పులు జరుగుతున్న సమయంలో ఆర్కేను ఆయన మరో గన్‌మెన్ ఉన్నపళంగా ఎత్తుకొని వెళ్లాడు. ఈ క్రమంలో, ఆర్కే గాయపడినట్టు సమాచారం. 
 
కాల్పులు ప్రారంభమైన వెంటనే ఆర్కే సెక్యూరిటీ సిబ్బంది తమపై కాల్పులు జరుపుతూ, ఆ ప్రాంతం నుంచి ఆయనను తీసుకెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. గాయపడిన ఆర్కే ఏవోబీలోని బెజింగి అటవీ ప్రాంతంలోనే ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఆయన కోసం 800 మంది గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, ఏపీ-ఒడిశా సంయుక్త దళాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. ఆర్కేను సజీవంగా పట్టుకోవడం లేదా మట్టుబెట్టడానికి ఇదే సరైన అవకాశం అని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments