Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఇద్దరు నేతలు కాదు - మహానుభావులు : జీవీఎల్‌కు పురంధేశ్వరి కౌంటర్

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (19:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. దివంగత మహానేతలు ఎన్టీఆర్, వైఎస్ఆర్‌లను ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీకి చెందిన సీనియర్ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆమె కౌంటర్ ఇచ్చారు. 
 
"అన్నీ ఇద్దరి పేర్లేనా" అంటూ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన పురంధేశ్వరి.. "ఒకరు తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం, 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందిస్తే, మరొకరు ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు, ఆరోగ్యశ్రీ అందించారు" అంటూ ట్వీట్ చేశారు. పైగా "ఆ ఇద్దరు కాదు.. ఆ మహానుభావులు" అని మరో ట్వీట్ చేశారు. 
 
రాష్ట్రంలో చాలాకాలంగా అన్నింటికీ ఆ ఇద్దరి పేర్లే కనిపిస్తున్నాయంటూ పరోక్షంగా ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఉద్దేశించి జీవీఎల్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయాలు కేవలం రెండు పార్టీలకో కుటుంబాలకే పరిమితంకాదన్నారు. ఏది చూసినా ఆ కుటుంబం లేదా ఈ కుటుంబం, ఆ పార్టీ, ఈ పార్టీ, అన్నీ ఇద్దరి పేర్లేనా, మిగతా నాయకులెవరూ కనిపించలేదా? అంటూ జీవీఎల్ ప్రశ్నించగా, ఈ వ్యాఖ్యలకు పురంధేశ్వరి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments