Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఇద్దరు నేతలు కాదు - మహానుభావులు : జీవీఎల్‌కు పురంధేశ్వరి కౌంటర్

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (19:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. దివంగత మహానేతలు ఎన్టీఆర్, వైఎస్ఆర్‌లను ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీకి చెందిన సీనియర్ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆమె కౌంటర్ ఇచ్చారు. 
 
"అన్నీ ఇద్దరి పేర్లేనా" అంటూ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన పురంధేశ్వరి.. "ఒకరు తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం, 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందిస్తే, మరొకరు ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు, ఆరోగ్యశ్రీ అందించారు" అంటూ ట్వీట్ చేశారు. పైగా "ఆ ఇద్దరు కాదు.. ఆ మహానుభావులు" అని మరో ట్వీట్ చేశారు. 
 
రాష్ట్రంలో చాలాకాలంగా అన్నింటికీ ఆ ఇద్దరి పేర్లే కనిపిస్తున్నాయంటూ పరోక్షంగా ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఉద్దేశించి జీవీఎల్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయాలు కేవలం రెండు పార్టీలకో కుటుంబాలకే పరిమితంకాదన్నారు. ఏది చూసినా ఆ కుటుంబం లేదా ఈ కుటుంబం, ఆ పార్టీ, ఈ పార్టీ, అన్నీ ఇద్దరి పేర్లేనా, మిగతా నాయకులెవరూ కనిపించలేదా? అంటూ జీవీఎల్ ప్రశ్నించగా, ఈ వ్యాఖ్యలకు పురంధేశ్వరి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments