Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక మాస్ రాజా వంతు... ఈడీ ఆఫీస్ కు చేరుకున్న హీరో రవితేజ!

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (12:02 IST)
మాద‌క ద్ర‌వ్యాల కేసులో మాస్ రాజా హీరో ర‌వితేజ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఆయ‌న ఈ రోజు   ఉద‌యం ప‌దిన్న‌ర‌కు ఈడీ కార్యాల‌యానికి చేరుకున్నారు. రవితేజ తో పాటు అత‌ని డ్రైవర్ శ్రీనివాస్ కూడా హాజర‌య్యాడు. నేరుగా త‌న ఫామ్ హౌస్ నుంచి ర‌వితేజ ఈడీ ఆఫీస్ కు వచ్చారు.  
 
హీరో త‌నీష్ నిర్వ‌హిస్తున్న‌ఎఫ్ క్లబ్ లో పార్టీలకు రవితేజ హాజ‌ర‌యిన‌ట్లు ఆరోపణలున్నాయి. దీనితో  టాలీవుడ్  డ్రగ్స్ కేసులో హీరో రవితేజను రెండో సారి ఈడీ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే ఛార్మి, ర‌కుల్, పూరీ స‌హా సినీ ప్రముఖులు  ఐదుగురిని ఈడీ ప్రశ్నించింది. 
 
అయితే,  రెండు రోజుల నుంచి ఈడీ విచారణ రూటు మార్చినట్లుంది. మాద‌క ద్ర‌వ్యాల సూత్ర‌ధారి కెల్విన్ ఈడీకి స‌రెండ‌ర్ కావ‌డంతో కేసు మ‌లుపు తిరిగింది. ఈసారి కెల్విన్  తో పాటు హీరో రవితేజను విచారించే అవకాముంది. అంటే, ప్ర‌స్తుతం కెల్విన్ వాంగ్మూలం ఆధారంగా ఈడీ కేసు విచారణ కొనసాగుతోంది. నిన్న కెల్విన్ తోపాటు రానాను విచారించిన అధికారులు, ఇవాళ కూడా కెల్విన్  సమక్షంలోనే ర‌వితేజ విచార‌ణ  కొనసాగించున్న‌ట్లు తెలుస్తోంది. డ్రగ్స్ వ్యవహారం, మనీలాండరింగ్ పై ర‌వితేజ‌ను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments