Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోని ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు నోటీసులు

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (09:12 IST)
మొదటి, రెండు దశల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ తీసుకోని ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధం కాబోతున్నాయి. మొదటి దశలో పారిశుధ్య, వైద్య ఆరోగ్య శాఖ, అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రాధాన్యమిచ్చారు.

రెండో దశలో పోలీసు, పంచాయతీ రాజ్‌, రెవెన్యూ శాఖల ఉద్యోగులకు వాక్సినేషన్‌ కార్యక్రమం జరిగింది.మొత్తం మీద 60 శాతం మందికి కూడా వ్యాక్సిన్‌ వేయలేకపోయారు.ఉద్యోగుల అనాసక్తే ఇందుకు ప్రధాన కారణంగా గుర్తించారు.

దీంతో టీకాలు వేసుకోని వారందరికీ నోటీసులు జారీ చేయాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ ఆదేశించినట్లు అధికారి పేర్కొన్నారు.

నిర్దిష్ట నమూనాలో ‘టీకాలు వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలన్నింటినీ వివరించారని, తామే అందుకు సుముఖంగా లేమని, తరువాత దీని వల్ల కలిగే దుష్పరిణామాలకు తామే బాధ్యత వహించగలమని’ వారి వద్ద నుంచి రాత పూర్వకంగా తీసుకోవాలని ఆదేశించారు.

దీంతో అన్ని శాఖలకు చెందిన అధికారులు నోటీసులు జారీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments