Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు నోటీసులు రాజకీయ కక్ష సాధింపులో భాగమే : వర్ల రామయ్య

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (12:32 IST)
తప్పుడు కేసులతో టిడిపి అధినేత చంద్రబాబును భయపెట్టాలనుకుంటున్నారని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సిఐడి నోటీసులు ఇచ్చారని ఆపార్టీ సీనయర్‌ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఎపి సిఐడి అధికారులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

దీనిపై టిడిపి నేతలు స్పందించారు. చంద్రబాబును రెండేళ్లలో ఏమీ చేయలేని జగన్‌ సర్కార్‌.. ఇప్పుడు ఏం చేస్తుందని ప్రశ్నించారు. రెండ్రోజుల నుంచి సిఎం జగన్‌ క్యాంప్‌ భయపడుతోందన్నారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంలో జగన్‌ ఉన్నారని విమర్శించారు. ఎ1, ఎ2 బెయిల్‌ రద్దయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఎపి సిఎంపై ఉన్న కేసులు దేశంలో ఏ ముఖ్యమంత్రులపైనా లేవని వర్ల రామయ్య పేర్కొన్నారు.

మరో టిడిపి నేత బోండా ఉమా మాట్లాడుతూ.. 21 నెలలుగా వైసిపి ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌పై ఇప్పటికే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందన్నారు. వైసిపి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. దీనిపై హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments