చంద్రబాబుకు నోటీసులు రాజకీయ కక్ష సాధింపులో భాగమే : వర్ల రామయ్య

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (12:32 IST)
తప్పుడు కేసులతో టిడిపి అధినేత చంద్రబాబును భయపెట్టాలనుకుంటున్నారని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సిఐడి నోటీసులు ఇచ్చారని ఆపార్టీ సీనయర్‌ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఎపి సిఐడి అధికారులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

దీనిపై టిడిపి నేతలు స్పందించారు. చంద్రబాబును రెండేళ్లలో ఏమీ చేయలేని జగన్‌ సర్కార్‌.. ఇప్పుడు ఏం చేస్తుందని ప్రశ్నించారు. రెండ్రోజుల నుంచి సిఎం జగన్‌ క్యాంప్‌ భయపడుతోందన్నారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంలో జగన్‌ ఉన్నారని విమర్శించారు. ఎ1, ఎ2 బెయిల్‌ రద్దయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఎపి సిఎంపై ఉన్న కేసులు దేశంలో ఏ ముఖ్యమంత్రులపైనా లేవని వర్ల రామయ్య పేర్కొన్నారు.

మరో టిడిపి నేత బోండా ఉమా మాట్లాడుతూ.. 21 నెలలుగా వైసిపి ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌పై ఇప్పటికే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందన్నారు. వైసిపి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. దీనిపై హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments