Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు నోటీసులు రాజకీయ కక్ష సాధింపులో భాగమే : వర్ల రామయ్య

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (12:32 IST)
తప్పుడు కేసులతో టిడిపి అధినేత చంద్రబాబును భయపెట్టాలనుకుంటున్నారని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సిఐడి నోటీసులు ఇచ్చారని ఆపార్టీ సీనయర్‌ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఎపి సిఐడి అధికారులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

దీనిపై టిడిపి నేతలు స్పందించారు. చంద్రబాబును రెండేళ్లలో ఏమీ చేయలేని జగన్‌ సర్కార్‌.. ఇప్పుడు ఏం చేస్తుందని ప్రశ్నించారు. రెండ్రోజుల నుంచి సిఎం జగన్‌ క్యాంప్‌ భయపడుతోందన్నారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంలో జగన్‌ ఉన్నారని విమర్శించారు. ఎ1, ఎ2 బెయిల్‌ రద్దయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఎపి సిఎంపై ఉన్న కేసులు దేశంలో ఏ ముఖ్యమంత్రులపైనా లేవని వర్ల రామయ్య పేర్కొన్నారు.

మరో టిడిపి నేత బోండా ఉమా మాట్లాడుతూ.. 21 నెలలుగా వైసిపి ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌పై ఇప్పటికే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందన్నారు. వైసిపి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. దీనిపై హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments