Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొకే ఇవ్వలేదనీ అలిగి వెళ్లిపోయిన టీడీపీ ఎంపీ వేమిరెడ్డి

ఠాగూర్
సోమవారం, 4 నవంబరు 2024 (10:44 IST)
టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కోపం వచ్చింది. అందరితో పాటు తనకు బొకే ఇవ్వకపోవడంతో ఆయన అవమానంగా ఫీలయ్యారు. దీంతో వేదికపై నుంచి లేచి అలిగి వెళ్లిపోయారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో జరిగింది. ఆదివారం జిల్లా కేంద్రంలో ఈ మండలి సమావేశం జరిగింది. నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పి.నారాయణ కూడా హాజరయ్యారు.
 
అధికారులు ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తూ అందరికీ బొకేలు అందించారు. నెల్లూరు రూరల్ ఆర్డీవో ప్రత్యూష ప్రజాప్రతినిధుల పేర్లను పిలుస్తున్నారు. అయితే వేదికపై ఉన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తనకు బొకే ఇవ్వకపోవడం పట్ల అవమానంగా భావించారు. ఆగ్రహంతో వెంటనే వేదిక దిగారు. మంత్రులు ఆయనకు సర్దిచెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 
 
తనకు అవమానం జరిగిన చోట ఉండలేనని చెబుతూ, వేమిరెడ్డి తన అనుచరులతో కలిసి జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. వేమిరెడ్డితో పాటే ఆయన అర్థాంగి, కోవూరు టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కూడా అక్కడి నుంచి నిష్క్రమించారు. 
 
కాగా, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ ఘటన నేపథ్యంలో, అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు, ఇతర అధికారులకు స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments