Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రయాణిస్తూ బందరు కాల్వలో దూకిన మహిళ... ఎందుకు.. ఎక్కడ?

ఠాగూర్
సోమవారం, 4 నవంబరు 2024 (10:02 IST)
రైలులో ప్రయాణిస్తూ వచ్చిన ఓ మహిళ ఆకస్మికంగా ఓ నీటి కాలువలో దూకేసింది. దీంతో ఆమె నీటి ప్రవాహంలో కొట్టుకునిపోతూ చివరకి ఓ చెట్టును పట్టుకుని రాత్రంతా అలానే గడిపింది. ఈ ఘటన విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే, ఈ మహిళ మానసిక సమస్యతో బాధపడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. 
 
బాపట్ల జిల్లా భట్టిప్రోలుకు చెందిన ప్రైవేటు ఉద్యోగి షేక్ ఖాదర్ వలి భార్య, పిల్లలతో కలిసి నిజాంపట్నంలో ఉంటున్నారు. ఆయన భార్య జన్నతున్నీసా (47) కొన్నేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చిన ఆమె గుంటూరు జిల్లా నిడుబ్రోలులో విజయవాడ వైపు వెళ్లే రైలెక్కింది.
 
రాత్రి 11 గంటల సమయంలో రైలు విజయవాడ పూల మార్కెట్ పరిసరాలకు చేరుకుంది. అక్కడామె రైలు నుంచి కిందనున్న బందరు కాల్వలోకి దూకేసింది. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఓ చెట్టును పట్టుకుని రాత్రంతా అలాగే గడిపింది. ఉదయం స్థానికులు ఆమెను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి ఆమెను రక్షించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments