Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ ఏలుబడిలో 9 నెలలుగా వేతనంలేని ఉద్యోగం...

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (10:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు చుక్కలు చూపిస్తుంది. సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదు. కొందరికీ అరకొరగా ఇస్తుంది. మరికొందరికి నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులై ఉండికూడా నెల నెలా జీతం ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ గగనంగా మారింది. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలోని ఉద్యోగులకు గత 9 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. 
 
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా కొన్ని జిల్లాలను హడావుడిగా ఏర్పాటు చేసింది. ఈ జిల్లా ఏర్పాటు అయితే ఘనంగా చేసినప్పటికీ ఆ జిల్లా కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదు. దీంతో కొన్ని చోట్ల ఇబ్బందులు తప్పటం లేదు. గత ఏడాది ఉమ్మడి కృష్ణా జిల్లాను ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలుగా ఏర్పాటు చేశారు. 
 
ఎన్టీఆర్‌ జిల్లా డీఈవో (విద్యాశాఖాధికారి)గా పశ్చిమగోదావరి జిల్లా డీఈవో సి.వి.రేణుకను నియమించారు. ఆమెకు 9 నెలలుగా జీతం రాలేదు. ఎన్టీఆర్‌ జిల్లాకు డీఈవో పోస్టు అధికారికంగా మంజూరు కాకపోవడమే ఇందుకు కారణం. డీఈవోను డీఎస్‌ఈవోగా(జిల్లా స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అధికారి) చూపినా జీతం విడుదల కాలేదు. దీంతో ఆఘమేఘాల మీద కృష్ణా జిల్లా డైట్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా(డైట్‌ ప్రిన్సిపల్‌ పోస్టు డీఈవో పోస్టుకు సమానం. రెండూ జిల్లా స్థాయి పోస్టులే) నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. 
 
రేణుక సోమవారం డైట్‌ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎన్టీఆర్‌ జిల్లా డీఈవో(ఎఫ్‌ఏసీ)గా ఆమె కొనసాగుతారు. తాను జీతం కోసమే ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు అధ్యాపకుల సమావేశంలో ఆమె తెలిపారు. దీనిపై రేణుకను వివరణగా కోరగా... జీతం కోసం అంగలూరు డైట్‌ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు తీసుకున్నానని, ఎఫ్‌ఏసీగా పాత ప్రిన్సిపల్‌ కొనసాగుతారని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments