Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోకెన్ కౌంటర్లు ఖాళీ, తిరుమల భక్తులు నిల్, ఏమైంది?

Webdunia
సోమవారం, 6 జులై 2020 (20:35 IST)
మూడు నెలల గ్యాప్ తరువాత మళ్ళీ తిరుమల శ్రీవారి దర్సనం ప్రారంభమైంది. ఇక భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతుందని అందరూ భావించారు. అనుకున్న విధంగానే ఆన్లైన్ లోను, సాధారణంగా కౌంటర్ల ద్వారా టోకెన్లను అందించారు.
 
కౌంటర్లలో టోకెన్లను పొందేందుకు జనం బారులు తీరి కనిపించారు. ఇదంతా గత నెల 10వ తేదీ నుంచి జరిగింది. అయితే సరిగ్గా మూడు రోజుల నుంచి టోకెన్లు తీసుకునే భక్తులు కరువయ్యారు. పూర్తిగా కౌంటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.
 
భక్తులు లేరు. స్థానికులే ఆధార్ కార్డులు చూపించి టోకెన్లను పొందుతున్నారు. రేపటి దర్సనానికి ముందు రోజే టోకెన్లు ఇస్తున్నా ఎవరూ ముందుకు రావడం లేదు. ఇందుకు కారణం కరోనా వైరస్ వ్యాపిస్తోందని.. టిటిడి ఉద్యోగులకే కరోనా సోకుతోందన్న ప్రచారం బాగా జరగడమని భావిస్తోంది టిటిడి.
 
అయితే భక్తుల వల్ల కరోనా వ్యాప్తి చెందడం లేదని... టిటిడిలో పనిచేసే 17మంది ఉద్యోగులకు మాత్రమే కరోనా సోకిందని స్వయంగా టిటిడి పాలకమండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. ఇది కాస్త ఇంకా బాగా ప్రచారం జరగడంతో భక్తుల రద్దీ తగ్గుతున్నట్లు టిటిడి అధికారులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments