Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకు జీతాలు పెంచలేం.. తేల్చేసిన ఏపీ ప్రభుత్వం

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2023 (11:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెలుగు పరిధిలో పనిచేస్తున్న మండల సమాఖ్య క్లస్టర్‌ కోఆర్డినేటర్ల (ఎంఎస్‌సీసీ) ఆశలపై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా వేతనాలు పెంచలేమని తేల్చి చెప్పేసింది. ఎఫ్‌టీఈ హెచ్‌ఆర్‌ పాలసీలోకి తీసుకురావడమూ కుదరదని తేల్చిచెప్పింది.
 
ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ ఈ నెల 4వ తేదీన మెమో జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్‌సీసీలు 1100 మంది వరకున్నారు. దీనిపై సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌ వివరణ కోరగా సంబంధిత దస్త్రం తమకు ఇంకా చేరలేదని అన్నారు.
 
ఎంఎస్‌సీసీలు, అకౌంటెంట్లకు వేతనాలు పెంచుతామని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలుచేయిస్తామని వెలుగు, వైకేపీలో పనిచేస్తున్న కొంతమంది నుంచి పంచాయతీరాజ్‌శాఖ పరిధిలోని ఓ అధికారి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని అప్పట్లో ఆరోపణలొచ్చాయి.
 
పలువురి వద్ద రూ.20 వేల నుంచి రూ.36 వేల వరకు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. పని అయ్యే వరకు విషయాన్ని ఎక్కడా బయటపెట్టొద్దని సంబంధిత సంఘం నాయకుడు టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా వివరించడం అప్పట్లో వైరల్‌ అయింది. దీంతో వసూళ్ల బాగోతం వెలుగుచూసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments