Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకు జీతాలు పెంచలేం.. తేల్చేసిన ఏపీ ప్రభుత్వం

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2023 (11:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెలుగు పరిధిలో పనిచేస్తున్న మండల సమాఖ్య క్లస్టర్‌ కోఆర్డినేటర్ల (ఎంఎస్‌సీసీ) ఆశలపై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా వేతనాలు పెంచలేమని తేల్చి చెప్పేసింది. ఎఫ్‌టీఈ హెచ్‌ఆర్‌ పాలసీలోకి తీసుకురావడమూ కుదరదని తేల్చిచెప్పింది.
 
ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ ఈ నెల 4వ తేదీన మెమో జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్‌సీసీలు 1100 మంది వరకున్నారు. దీనిపై సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌ వివరణ కోరగా సంబంధిత దస్త్రం తమకు ఇంకా చేరలేదని అన్నారు.
 
ఎంఎస్‌సీసీలు, అకౌంటెంట్లకు వేతనాలు పెంచుతామని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలుచేయిస్తామని వెలుగు, వైకేపీలో పనిచేస్తున్న కొంతమంది నుంచి పంచాయతీరాజ్‌శాఖ పరిధిలోని ఓ అధికారి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని అప్పట్లో ఆరోపణలొచ్చాయి.
 
పలువురి వద్ద రూ.20 వేల నుంచి రూ.36 వేల వరకు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. పని అయ్యే వరకు విషయాన్ని ఎక్కడా బయటపెట్టొద్దని సంబంధిత సంఘం నాయకుడు టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా వివరించడం అప్పట్లో వైరల్‌ అయింది. దీంతో వసూళ్ల బాగోతం వెలుగుచూసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments