Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేలిపోయింది... ఇక 2019లో తెదేపాకు ఛాన్సే లేదు... రోజా ట్వీట్స్

నిన్న లోక్ సభలో గల్లా జయదేవ్, తెదేపా ఎంపీలు చేసిన డ్రామాతో ఇక 2019లో తెలుగుదేశం పార్టీకి ఛాన్సే లేదని తేలిపోయింది. ఏపీకి సాధించుకోవాల్సిన హక్కులను రాబట్టడంలో వారు పూర్తిగా విఫలమయ్యారు. ఏపీకి ఇక అవసరమైన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ రోజా ట్వీట్

Webdunia
శనివారం, 21 జులై 2018 (20:56 IST)
నిన్న లోక్ సభలో గల్లా జయదేవ్, తెదేపా ఎంపీలు చేసిన డ్రామాతో ఇక 2019లో తెలుగుదేశం పార్టీకి ఛాన్సే లేదని తేలిపోయింది. ఏపీకి సాధించుకోవాల్సిన హక్కులను రాబట్టడంలో వారు పూర్తిగా విఫలమయ్యారు. ఏపీకి ఇక అవసరమైన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ రోజా ట్వీట్ చేశారు.
 
కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పూర్తిగా బెడిసికొట్టిందని బీజేపీ ఎమ్మెల్యే మాధవ్ ఆరోపించారు. అవిశ్వాసం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అవిశ్వాసం వీగిపోవడం ద్వారా టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలిందన్నారు. ఆంధ్రప్రదేశ్ పరువును తెలుగుదేశం పార్టీ బజారుకు ఈడ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్‌, టీడీపీ మైత్రీ బంధానికి లోక్‌సభ వేదికగా నిలిచిందని విమర్శించారు. 
 
త్వరలో టీడీపీలో తిరుగుబాటు మొదలవుతుందన్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అసత్యాలు సభలో ప్రస్తావించారని ఆరోపించిన ఆయన... ఆర్థిక మంత్రికి సన్మానం, అసెంబ్లీ తీర్మానం చేసింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధిపై బీజేపీ రాజీపడదని... ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని ఆనయ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments